A2Z सभी खबर सभी जिले की

“అసైన్డ్‌ కమిటీని పునరుద్ధరించాలి”

అసైన్డ్‌ కమిటీని పునరుద్ధరించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గాడి అప్పారావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం విజయనగరం కలెక్టరేట్‌ వద్ద జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడారు. అసైన్డ్‌ కమిటీని ఏర్పాటు చేయకపోవడం వల్ల జిల్లాలో పేదలకు పంచాల్సిన భూములు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.
కొన్ని భూములు అన్యాక్రాంతమవుతున్నాయని ఆరోపించారు. కమిటీని వేసి భూ పంపిణీ చేపట్టాలని కోరారు.

Show More
Back to top button
error: Content is protected !!