
అసైన్డ్ కమిటీని పునరుద్ధరించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గాడి అప్పారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం విజయనగరం కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడారు. అసైన్డ్ కమిటీని ఏర్పాటు చేయకపోవడం వల్ల జిల్లాలో పేదలకు పంచాల్సిన భూములు పెండింగ్లో ఉన్నాయన్నారు.
కొన్ని భూములు అన్యాక్రాంతమవుతున్నాయని ఆరోపించారు. కమిటీని వేసి భూ పంపిణీ చేపట్టాలని కోరారు.
